ఆదిపురుష్ ఈవెంట్లో చీర కట్టులో మెరిసిన కృతీ సనన్
ఆదిపురుష్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా కృతీ సనన్
రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతీ సనన్ నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవదత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ఇటీవలే ట్రైలర్తో రచ్చ లేపిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుమలలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభాస్ తెల్ల వస్త్రాలు ధరించగా, జానకిగా నటించిన కృతీ సనన్ నలుపురంగు చీరలో మెరిసింది.
ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. నా కెరీర్ తెలుగులో మొదలైంది. 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నా
జానకి పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం. అందుకు ఓం రౌత్, ప్రభాస్లకు కృతజ్ఞతలు. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ఆదిపురుష్ సెట్స్లో ప్రశాంత వాతావరణం ఉండేది. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన అందరిలో ఉండేది, అందుకే నిశ్శబ్ధంగా ఉండేవారు.
ప్రభాస్ విషయానికి వస్తే అతడు స్వీట్ పర్సన్. ఆయన కళ్లల్లో ఓ ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్ర ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరు అని పేర్కొంది.
ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా అనకూడదు. రామాయణం అనాలి. ఇందులో నటించడం నా అదృష్టం. స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా అన్నాడు.
ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానన్నాడు.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం బాణసంచా కోసమే అరకోటి ఖర్చు చేశారట. ఈవెంట్ నిర్వహణకు రెండున్నర కోట్ల పైచిలుకు వెచ్చించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ వంశీ, ప్రమోద్లు నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జూన్ 16న విడుదల కానుంది.
మరిన్ని ఫొటోలు
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్