
కన్నప్పతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది తమిళ నటి ప్రీతీ ముకుందన్. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకుందాం.

ప్రీతీ ముకుందన్ (Preity Mukhundhan) తమిళనాడులో పుట్టి పెరిగింది.తిరుచ్చిలో బీటెక్ పూర్తి చేసింది.

చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది. హిప్హాప్ నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది.

కాలేజీ రోజుల్లో మోడలింగ్తో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది

ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’. యూట్యూబ్లో ఈ ఆల్బమ్కు దాదాపు 6 మిలియన్స్కు పైగా వ్యూస్ వచ్చాయి.

శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీమ్ బుష్’తో టాలీవుడ్కు పరిచయమైంది.

కన్నప్ప’లో(Kannappa Movie) నెమలి అనే రాకుమార్తెగా కనిపించనుంది.

సోషల్మ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో ప్రీతీ ఒకరు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 16 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.










