రెండువేల రెండు వందల ఎకరాల్లో దస్తన్ ఆటో వరల్డ్ కార్స్ మ్యూజియం విస్తరించి ఉంది.
అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్లో నమోదైంది.
ఈ మ్యూజియంలో ఉన్న బైక్లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్.
ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి 100 రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు.
వింటేజ్ కారులో ప్రయాణించాలంటే 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అర్థమవుతుంది.


