పారిశ్రామిక నైపుణ్యతకు నిట్‌తో సీఐఐ ఎంఓయు | CII MoU with Warangal NIT | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక నైపుణ్యతకు నిట్‌తో సీఐఐ ఎంఓయు

Jan 9 2018 7:34 PM | Updated on Jan 9 2018 7:34 PM

కాజీపేట అర్బన్‌ : కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)తో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండ్రస్ట్రీ(సీఐఐ) ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణారావు, సీఐఐ తెలంగాణ చైర్మన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు వి.రాజన్‌లు మంగళవారం ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ సమావేశ మందిరంలో రమణారావు మాట్లాడుతూ పారిశ్రామిక నైపుణ్యతను అందించేందుకు, నూతన పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తున్న నిట్‌లోని విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం తోడ్పడనున్నట్లు తెలిపారు. సీఐఐ ద్వారా ఫ్యాకల్టీ, విద్యార్థులకు పారిశ్రామిక నైపుణ్యతను అందించడం ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలకవచ్చన్నారు. నగరాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని రాజన్న అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో నైపుణ్యత, వర్క్‌షాపులు, పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ నిట్‌ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులకు బోధించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిజస్ట్రార్‌ లక్ష్మారెడ్డి, డీన్‌లు రాంగోపాల్‌రెడ్డి, జయకుమార్, రామచంద్రయ్య, పీఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, సీఐఐ బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement