‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది! | Two passengers walk into trouble at Delhi’s IGI for joking about carrying bomb | Sakshi
Sakshi News home page

‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!

Jul 21 2016 3:32 PM | Updated on Sep 4 2017 5:41 AM

‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!

‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!

వారిద్దరు స్నేహితులు.. ఇండోర్‌ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు.

న్యూఢిల్లీ: వారిద్దరు స్నేహితులు.. ఇండోర్‌ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు. విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడినప్పుడు ఓ మిత్రుడు సరదాగా జోక్ చేశాడు. ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో అన్నాడు. ఈ మాట ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది చెవిన పడింది.

వారేదో నిజంగా ‘బాంబు’తో ఎక్కుతున్నట్టు హడలిపోయిన సిబ్బంది వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌)కు ఈ విషయాన్ని చేరవేశారు. ఎయిర్‍పోర్ట్ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్‌ బలగాలు వెంటనే ఆ స్నేహితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. వారిని చాలాసేపు విచారించి.. ప్రశ్నించి.. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించికున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులని వదిలేశారు. కానీ, ఆ ఇద్దరు సరదాగా వేసిన జోక్.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి బాంబు కలకలాన్ని రేపింది. సరదాకు ‘బాంబు’ అన్న పదాన్ని ఉచ్చరించినందుకు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.

ఇటీవలికాలంలో ఉగ్రవాద ముప్పు భారీగా పొంచి ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అనుమానమున్నా.. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. గత నెల ఓ కశ్మీరి మెడికల్ విద్యార్థిని కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. ఆమె బ్యాగుపై ‘ఇందులో బాంబు ఉండొచ్చు’ అన్న గ్రాఫిటీ ఉండటంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement