టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ | Toyota launches Camry Hybrid in India, priced at Rs 29.75 lakh | Sakshi
Sakshi News home page

టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ

Aug 29 2013 1:38 AM | Updated on Sep 1 2017 10:12 PM

టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ

టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ

టయోటా కంపెనీ కామ్రి హైబ్రిడ్‌ను భారత్‌లో బుధవారం ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: టయోటా కంపెనీ కామ్రి హైబ్రిడ్‌ను భారత్‌లో బుధవారం ఆవిష్కరించింది. దేశీయంగా తయారవుతున్న తొలి హైబ్రిడ్ కారు ఇదేనని టయోటా కిర్లోస్కర్ మోటార్  ఎండీ, సీఈవో హిరోషి నకగవ చెప్పారు. ఈ కామ్రి హైబ్రిడ్ ధరను రూ. 29.75 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని తెలిపారు.

బెంగళూరు సమీపంలోని బిదాడి ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ లైన్‌లో ఈ కారును తయారు చేస్తామని వివరించారు. 2.5 పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ ఉన్న ఈ కారు హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుందని, 19.16 కి.మీ. మైలేజీ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల హైబ్రిడ్ కార్లను విక్రయించామని టీకేఎం డిప్యూటీ ఎండీ, సీఈవో(ఎమ్‌అండ్‌సీ) సందీప్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement