'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా | rp patnayak petition on Atto Attama Kuturo serial | Sakshi
Sakshi News home page

'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా

Jul 31 2015 2:20 PM | Updated on Sep 3 2017 6:31 AM

'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా

'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా

'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ నిర్మాతలపై సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కోర్టుకు వెళ్లనున్నారు.

హైదరాబాద్ :  'అత్తో అత్తమ్మ కూతురో'  సీరియల్ నిర్మాతలపై సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కోర్టుకు వెళ్లనున్నారు. ఆ సీరియల్ నిర్మాతలపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న 'అత్తో అత్తమ్మ కూతురు' సీరియల్లో ఇంకా రిలీజ్ కాని 'తులసీదళం' సినిమా ట్రాక్లను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన చెప్పారు.

కాగా జూన్ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో అలనాటి నటి నిరోష, జాకి, మహర్షి తదితరులు నటిస్తున్నారు. సీరియల్ ప్రారంభమై గట్టిగా 2 నెలలు గడవక ముందే వివాదంలో చిక్కుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement