హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీవన్ దాన్' స్కీమ్ తెలంగాణలో విజయంసాధించినంతగా మరెక్కడా సాధించలేదు. అవయవదానం కోసం ప్రత్యకంగా తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన 241 మంది వ్యక్తులు తమ అవయవాలను సేకరించి 1,000మందికి ప్రాణదానం చేశారు. అయితే అవయవదానం ఆవశ్యకతను ముస్లింలకు తెలియపర్చడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందని తాజాగా వెల్లడయింది.
ముస్లిం కుటుంబాలకు చెందిన చాలా మంది అవయవదానానికి సరేమీరా అంటున్నారు. వీరిలో గ్రహీతల కుటుంబాలు కూడా ఉండటం గమనార్హం. 2013లో ప్రారంభమైన జీవన్ దాన్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకూ 39మంది ముస్లింలు అవయదానాన్ని పొందారు. కానీ దానం చేసుందుకు మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదని జీవన్ దాన్ కో-ఆర్డినేటర్ డా.జీ స్వర్ణలత చెప్పారు. ఈ విషయంలో ముస్లిం మత పెద్దల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో మైనారిటీలు నడుపుతున్న రెండు ఆసుపత్రులు జీవన్ దాన్ లో చేరేందుకు నిరాసక్తతను ప్రదర్శించాయని, ఆ రెండు ఆసుపత్రుల్లో 2,849 మందికి అవయవాల అవసరం ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, మతపరమైన అడ్డంకుల వల్లే ముస్లింలు అవయవదానాలకు ముందుకు రాకపోవడానికి గల కారణం అయిఉండొచ్చని డాక్టర్ స్వర్ణలత అంటున్నారు.
అవయవదానంపై ముస్లింల నిరాసక్తత
Published Tue, Aug 9 2016 2:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement