దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు అభిమాన లోకం మళ్లీ తలై‘వా’...అని నినదించే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో బుధవారం హల్చల్ చేసిన పోస్టర్లు ఈ చర్చకు తెర లేపాయి. అభిమానులతో కథానాయకుడు భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఏప్రిల్ రెండున కీలక నిర్ణయం ప్రకటన అన్నట్టు సంకేతాలు హోరెత్తాయి.
సాక్షి, చెన్నై : అశేషాభిమాన లోకం మన్నల్ని అందుకుం టున్న కథానాయకుడు రజనీకాంత్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు అప్పుడుప్పుడు తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. తమ పెద్దలతో సన్నిహితంగా ఉండే రజనీని ఆకర్షించే రీతిలో కమలనాథులు తీవ్ర కుస్తీలు పట్టినా, ఫలితం శూన్యం. రాజకీయ అరంగేట్ర నినాదం తెర మీదకు వచ్చినప్పుడల్లా, దేవుడు ఆదేశిస్తే.. అంటూ తన దైన శైలి హావభావాలతో రజనీకాంత్ ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి రావాలన్న నినాదం మిన్నంటింది.
ఈ నినాదంపై తన సన్నిహితులతో కథనాయకుడు చర్చలు జరుపుతున్నట్టుగా రాష్ట్రంలో ప్రచారం కూడా బయలు దేరింది. అయితే, సూపర్స్టార్ మాత్రం ఎక్కడ ఎవ్వరికీ చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు రెండు రోజులుగా తలై‘వా’ అన్న నినాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చి పోస్టర్లతో హల్ చల్ సృష్టించే పనిలో పడ్డారు. బుధవారం ఓ అడగు ముందుకు వేసినట్టుగా ఏర్పాటైన పోస్టర్లు ఈ చర్చకు దారి తీశాయి. శ్రీలంక పర్యటన చివరి క్షణంలో రద్దు కావడం, రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు తమ నాయకుడు సిద్ధం అవుతోన్నట్టుగా ప్రచారాన్ని అభిమానులు ఊపందుకునేలా చేయడం గమనార్హం.
అదే సమయంలో ఏప్రిల్ రెండో తేదీన అభిమానులతో రజనీ భేటీ కానున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం పలికి ఉన్నట్టు, ఏడు వేల మందితో సాగనున్న భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం హోరెత్తడంతో తమిళ మీడియాల్లో ప్రాధాన్యత పెరిగింది. శ్రీలంక పర్యటన రద్దుపై రజనీకాంత్ అక్కడి ఈలం తమిళులకు బుధవారం ఓ లేఖ రాయడంతో అభిమానుల్లో ఉత్సాహం బయలు దేరింది.
సమయం అనుకూలిస్తే ఈలం తమిళుల్ని తప్పకుండా కలుస్తా అని ఆయన రాసిన లేఖతో అభిమానులు కాస్త అత్యుత్సాహం, దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. తమిళనాట సమయం అనుకూలంగానే ఉన్నట్టు, రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చే పనిలో పడడం గమనార్హం. కోడంబాక్కం రాఘవేంద్రకల్యాణ మండపం వేదికగా ఏప్రిల్ రెండో తేదీన రజనీకాంత్ అభిమానులతో భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో, అలాంటి కార్యాచరణే లేదంటూ ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
మళ్లీ తలై‘వా’
Published Thu, Mar 30 2017 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement