హైకోర్టులో రాధేమాకు ఊరట | Radhe Maa gets anticipatory bail in dowry harassment case | Sakshi
Sakshi News home page

హైకోర్టులో రాధేమాకు ఊరట

Oct 8 2015 12:47 PM | Updated on May 25 2018 12:56 PM

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. వరకట్నం వేధింపుల కేసులో రాధేమాకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. వరకట్నం వేధింపుల కేసులో రాధేమాకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే డెరే.. రాధేమా పిటిషన్ను విచారించారు. రాధేమా తరపు న్యాయవాది, ముంబై పోలీసులు వాదనలు విన్న అనంతరం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పోలీసులు విచారణకు పిలిచినపుడు హాజరు కావాలని రాధేమాను ఆదేశించారు. రాధేమా తన అత్తమామలను ప్రేరేపించి వరకట్నం కోసం వేధించారని ఓ వివాహిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు రాధేమాను ఇటీవల విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement