మహారాష్ట్ర- మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చింద్వారా సమీపంలో విమానం కూలి శిక్షణలో ఉన్న ఓ పైలట్ మరణించాడు. పుణెకు చెందిన సోహెల్ జహీరుద్దీన్ అన్సారీ (19) డైమండ్ డీఏ-40 చిన్న విమానాన్ని మూడు గంటల పాటు శిక్షణ కోసం అద్దెకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని బిర్సీ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 గంటలకల్లా తిరిగి రావాల్సి ఉంది. కానీ, గంట తర్వాత విమానానికి గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి.
బుధవారం ఉదయం మధ్యప్రదేశ్లోని చింద్వారా గ్రామస్థులు తాము సమీపంలోని కొండల వద్ద విమాన శిథిలాలను చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు వెళ్లి గాలించగా విమాన శిథిలాలు, అన్సారీ మృతదేహం కనిపించాయి. అతడు ఉత్తరప్రదేశ్లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చదువుతున్నట్లు తెలిసింది.
విమాన దుర్ఘటనలో ట్రైనీ పైలట్ మృతి
Published Wed, Dec 25 2013 2:49 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement