ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి | Preity Zinta meets Maria seeking permission to fly abroad | Sakshi
Sakshi News home page

ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి

Jun 30 2014 9:28 PM | Updated on Sep 2 2017 9:36 AM

ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి

ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి

మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి ప్రీతిజింటా సోమవారం ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను కలిశారు.

ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి ప్రీతిజింటా సోమవారం ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను కలిశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. కమిషనర్ వెంటనే ఆమెకు అనుమతియిచ్చారు. ఈ సందర్భంగా వేధింపుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కమిషనర్ కు తెలిపారు. ఈ కేసులో ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు ఇటీవల వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement