హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద బాట్లింగ్ యూనిట్ను మన రాష్ట్రంలో పెప్సికో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్లోని 80 ఎకరాల్లో రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్కు శనివారం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్ రెడ్డి హైదరాబాద్లో లాంఛనంగా భూమి పూజ చేశారు. భారత్లో 2020 నాటికి రూ. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంలో భాగంగా ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని, పెప్సీకి ఉన్న 38 ప్లాంట్లలో ఇదే పెద్దదని పెప్సికో ఇండియా చైర్మన్ అండ్ సీఈవో శివ్ శివకుమార్ చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం 3.6 లక్షల లీటర్లు. మొదటి దశలో రూ. 450 కోట్ల పెట్టుబడి అంచనాతో 1.2 లక్షల లీటర్ల ఉత్పత్తిని 2014 చివరికల్లా అందుబాటులోకి తెస్తామని, రెండో దశ 2015కి, మూడో దశ 2017కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శివకుమార్ తెలియజేశారు.
ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి లభిస్తుందని, ఈ యూనిట్కు అవసరమైన నీటిని తెలుగుగంగ నుంచి తీసుకోనున్నామని తెలిపారు. దేశంలో అతి ఎక్కువ మామిడి గుజ్జు (పల్ప్) ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్లోనేనని, ఇక్కడ తమ వాటాను పెంచుకోవాలనుకుంటున్నామని, మూడు దశలూ పూర్తయితే సుమారు 50,000 నుంచి 60,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. పెప్సికోకి ఇప్పటికే సంగారెడ్డిలో ఒక యూనిట్ ఉంది.
కరెంటు కోతలుండవు...
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి... రాజకీయ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వెనుకబడలేదని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతేడాది విద్యుత్ కోత ఉన్నప్పటికీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదని, వచ్చే వేసవిలో కూడా కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఇప్పటికే రూ. 40,000 కోట్లతో 7,000 మెగావాట్ల విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసినప్పటికీ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. ఒక్కసారి గ్యాస్ సరఫరా జరిగితే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. పెప్సీ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ. 33,000 కోట్లలో అత్యధిక భాగం రాష్ట్రానికి కేటాయించాలని, ఇందుకు కావల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పెప్సీ భారీ యూనిట్
Published Sun, Dec 22 2013 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement