రిలయన్స్ జియో మరో ఎత్తుగడ | Next from Jio 'digital mission' - connected car app, JioTV and more | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో మరో ఎత్తుగడ

Jan 18 2017 3:16 PM | Updated on Aug 14 2018 3:22 PM

రిలయన్స్ జియో మరో ఎత్తుగడ - Sakshi

రిలయన్స్ జియో మరో ఎత్తుగడ

టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఎత్తుగడకు సిద్ధమవుతోంది.

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఎత్తుగడకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలోనూ తన హవా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను రూపొందిస్తుందట. ఈ యాప్తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చట. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట. 
 
''రిలయన్స్ జియో కారు కనెక్టెడ్ డివైజ్ రూపొందించడానికి సిద్ధమైంది. ఈ యాప్తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. కారులో వై-ఫై వాడుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి కారు ఓనర్ తన డివైజ్లో జియో సిమ్ వాడాల్సి ఉంటుంది'' అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. దీనికోసం ఆటోమొబైల్ కంపెనీలతో జియో నడుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ డిజిటల్ మిషన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని ధర జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగాను, సమానంగాను ఉండొచ్చని సమాచారం. కారు యాప్నే కాక, త్వరలోనే జియో టీవీలు వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement