
ప్రణబ్ కు మమత పరామర్శ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గురువారం పరామర్శించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం ఆయనకు ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్ను అమర్చారు.
కాగా, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమిద్ తో రాష్ట్రపతి చర్చలు జరపనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ అధ్యక్షుడు గురువారం భారత్ కు వచ్చారు.