ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! | Its a massive operation, as 86% currency is changed | Sakshi
Sakshi News home page

ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

Nov 12 2016 5:30 PM | Updated on Apr 3 2019 5:16 PM

ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! - Sakshi

ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

పెద్దనోట్లను రద్దుచేసి.. ఆ స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడమనేది భారీ ఆపరేషన్‌ అని, ఆ ఆపరేషన్‌ ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు పాతనోట్లను మార్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో నిత్యావసరాలకు సైతం సరిపడా డబ్బు దొరకకా.. జనం నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగా జారీచేసిన రూ. రెండువేల నోట్లు ఏటీఎంలలో వచ్చేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ మార్చాల్సి రావడంతో ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏటీఎంల సమస్యపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్టాఫ్‌వేర్‌లో మార్పులతో కొత్త నోట్లు అందించేవిధంగా రెండువారాల్లో దేశమంతటా ఏటీఎంలు అందుబాటులోకి తీసుకువస్తామని  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement