భారతదేశంలో ఉన్న ప్రజలంతా సెక్యులర్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వారిని మతవాదులుగా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన విమర్శించారు.
హైదరాబాద్:భారతదేశంలో ఉన్న ప్రజలంతా సెక్యులర్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వారిని మతవాదులుగా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన విమర్శించారు.
దేశంలో మెజారిటీ ఉన్న హిందువులు సెక్యులర్లుగా ఉన్ననాళ్ళూ.. మైనారిటీల భద్రతకు ముప్పేమి లేదని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రాజీవ్ సద్భావన అవార్డును గులాంనబీ ఆజాద్ కు ఆయన అందజేశారు.