అంబాసిడర్‌ బ్రాండ్‌ అమ్మేశారు..

అంబాసిడర్‌ బ్రాండ్‌ అమ్మేశారు..


కోలకత్తా: అంబాసిడర్‌..ఒకపుడు ఈ పేరు వింటేనే.. అదో రాజసం..దర్పం...దశాబ్దం క్రితం వరకు  ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్‌ కారు బ్రాండ్‌ను ఓ విదేశీ కార్ల సంస్థసొంతం చేసుకుంది.  దేశీయ కార్‌ మేకర్‌ హిందుస్తాన​ మోటార్స్‌ అంబాసిడర్‌  కారు బ్రాండ్ ను  ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యుగోట్‌కు విక‍్రయించింది.



ఈ మేరకు సి కె బిర్లా గ్రూప్ యాజమాన్యంలోని హిందూస్థాన్ మోటార్స్ శుక్రవారం రూ .80 కోట్ల ఒప్పందం చేసుకుంది.  ఈ  ట్రేడ్‌ మార్క్‌ అమ్మకం  ద్వారా   వచ్చి న ఆదాయాన్ని ఉద్యోగులు ,  రుణదాతల బకాయిలను క్లియర్  చేయడానికి ఉపయోగించనున్నట్టు సికె బిర్లా గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యుగోట్ ఈ బ్రాండ్‌ ను  ఇండియాలో  పునరద్ధరిస్తుందా లేదా  అనేది  ఇంకా స్పష్టత లేదు.



ఏడు దశాబ్దాల  క్రితం  అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తిని హిందుస్తాన్‌​  మోటార్స్‌ లాంచ్‌ చేసింది.  మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ కి కొద్ది మార్పులు చేసిదీన్ని మార్కెట్‌ లో ప్రవేశపెట్టింది. 1960 -70 దశకాల్లో ఒక వెలుగు వెలిగింది.  భారత రోడ్లపై  అంబాసిడర్‌ వాహనాల ఆధిపత్యం కొనసాగింది.  దాదాపు 1980లో మారుతి 800 రాక  అంబాసిడర్‌కు భారీ దెబ్బ తగిలింది.   ఎంతగా అంటే...1980  మధ్యకాలంలో 24వేల అంబాసిడర్‌ వాహన విక్రయాలు నమోదు కాగా, 2013-14  నాటికి  విక్రయాలు 2,500 స్థాయికి  పడిపోయాయి. కాగా ఈ  కార్ల ఉత్పత్తి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top