‘తోటపల్లి’ రద్దు కోరుతూ రైతుల ఆందోళన | Farmers agitaton to seeking of Thotapally project | Sakshi
Sakshi News home page

‘తోటపల్లి’ రద్దు కోరుతూ రైతుల ఆందోళన

Aug 12 2015 4:54 PM | Updated on Jun 4 2019 5:04 PM

తోటపల్లి ప్రాజెక్టు జలాశయం నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన 100 మంది రైతులు ఆందోళనకు దిగారు.

చిగురుమామిడి(కరీంనగర్): తోటపల్లి ప్రాజెక్టు జలాశయం నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన 100 మంది రైతులు ఆందోళనకు దిగారు. కోహెడ- ముల్కనూర్ రహదారిపై బుధవారం సాయంత్రం 2 గంటలకు రాస్తారోకోకు పూనుకున్నారు.

ప్రాజెక్టు కారణంగా తమ 500 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని, అవి మునిగితే తామెలా బతకాలని ప్రశ్నించారు. ప్రాజెక్టును రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైందేనని వారు స్పష్టం చేశారు. రైతులు గంట అనంతరం ఆందోళనను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement