ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం కొంతపుంతలు తొక్కుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం కొంతపుంతలు తొక్కుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మోసగాడని, అన్నా హజారే కు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి ఎవరినైనా మోసగించగలడని వాయిస్ రికార్డెడ్ కాల్స్తో ఆమ్ అద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు ఆప్ పార్టీ తమకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ఓటర్లకు వివరించే ప్రీరికార్డెడ్ కాల్స్తో సందేశాలను అందించడం ప్రారంభించింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి, దాని నేత అరవింద్ కేజ్రీవాల్కు ఓటు వేయరాదని హెచ్చరిస్తూ ఈ నెలారంభంలో పలువురు మొబైల్ ఫోన్ వాడకందారులకు కాల్స్ వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్, అన్నాహజారే నేతృత్వంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తాను పనిచేశానని, కానీ ఆ తరువాత కేజ్రీవాల్ కాంగ్రెస్తో కుమ్మక్కై అన్నాకు వెన్నుపోటు పొడిచారని, తన వారిని మోసగించిన వ్యక్తి ఎవరికైనా ద్రోహం చేయగలడని, కాబట్టి రానున్న ఎన్నికలలో కేజ్రీవాల్కు, అతని పార్టీకి ఓటు వేయరాదని చెబుతూ రికార్డు చేసిన శ్రీఓమ్ అనే ఓ వ్యక్తి సందేశం మొబైల్ ఫోన్ల ద్వారా పలువురికి చేరింది.