శ్రీకాకుళం జిల్లాకు 243 కోట్ల సహాయాన్ని అందించండి: కృపారాణి | Dr Killi Kruparani seeks Rs 243 cr package for cyclone-hit Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాకు 243 కోట్ల సహాయాన్ని అందించండి: కృపారాణి

Oct 17 2013 9:23 PM | Updated on Oct 22 2018 9:16 PM

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం 243 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజిని అందించాలని యూపీఏ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం 243 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజిని అందించాలని యూపీఏ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కోరారు. 
 
ఫైలీన్ తుఫాన్ కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిందని సోనియాకు శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తెలిపారు. సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్యాకేజి తో అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని మీడియాకు కృపారాణి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement