జూన్ రెండుకల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం | discussions on andhra pradesh employees division | Sakshi
Sakshi News home page

జూన్ రెండుకల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం

Mar 13 2014 7:53 PM | Updated on Aug 18 2018 4:13 PM

రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది.

న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో కలసి డీవోపీటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్‌జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది.

రెండు వారాల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని కమల్నాథన్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.స్థానికతనా లేక మరింకేమైనా అంశాలను ఆధారం చేసుకోవాలా అన్న దానిపై చర్చించినట్లు కమల్ నాథన్ తెలిపారు. దీనిపై మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. జూన్ రెండు కల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement