వెయ్యి దాటిన ‘హజ్’ మృతుల సంఖ్య | Death toll over a thousand of Hajj | Sakshi
Sakshi News home page

వెయ్యి దాటిన ‘హజ్’ మృతుల సంఖ్య

Sep 28 2015 1:55 AM | Updated on Sep 28 2018 3:41 PM

హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు...

- మృతుల్లో 35 మంది భారతీయులు
మినా:
హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య 35కి చేరింది. తాజాగా గుర్తించిన మృతులు జార్ఖండ్, యూపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారని అధికారవర్గాలు తెలిపాయి. హజ్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సౌదీ రాజు సల్మాన్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement