కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం | blast at Kaleshwaram project tunnel: several died | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

Sep 20 2017 4:51 PM | Updated on Oct 30 2018 7:50 PM

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.

- టన్నెల్‌లో పేలుడు.. ఏడుగురు కూలీల మృతి

సాక్షి, ఇల్లంతకుంట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్‌ మార్గంలో బుధవారం పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్‌ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అప్‌డేట్స్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్‌లో పేలుడు ఘటనలో గాయపడి కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5:30కు మరో కూలీ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement