ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన | AP Photo journalists condemn Mumbai gang rape | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

Aug 23 2013 1:36 PM | Updated on Sep 1 2017 10:03 PM

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో సామూహిక అత్యచారం జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.

విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో సామూహిక అత్యచారం జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు.. అందునా ముఖ్యంగా మహిళా పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఏపీపీజేఏ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఫొటో జర్నలిస్టులతో పాటు పలువురు పాత్రికేయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, మరోవైపు ముంబైలో ఫొటో జర్నలిస్టుల సంఘాలు మౌన నిరసన తెలిపాయి. మహారాష్ట్ర వ్యాప్తంగాను, ముంబై మహానగరంలోను శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని ఈ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్లను కలిసి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించాయి.

Advertisement
 
Advertisement
Advertisement