బాండ్ల ద్వారా ఎయిర్‌టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ | Airtel through the mobilization of billions of dollars in bonds | Sakshi
Sakshi News home page

బాండ్ల ద్వారా ఎయిర్‌టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ

Jun 5 2015 1:27 AM | Updated on Sep 3 2017 3:13 AM

బాండ్ల ద్వారా ఎయిర్‌టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ

బాండ్ల ద్వారా ఎయిర్‌టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పదేళ్ల కాల పరిమితి బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు...

న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పదేళ్ల కాల పరిమితి బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఈ నిధులను పెట్టుబడి వ్యయాల కోసం వినియోగించనుంది. 66 శాతం బాండ్లను అమెరికా ఇన్వెస్టర్లకు, 18 శాతాన్ని యూరప్, 16 శాతాన్ని ఆసియా ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశీ ప్రైవేట్ కంపెనీ.. బాండ్ల జారీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సమీకరించడం ఇదే ప్రథమం. ఎయిర్‌టెల్ గతేడాది డెట్ మార్కెట్ నుంచి 2.5 బిలియన్ డాలర్లు సమీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement