మీ బస్సులో అనుమతిస్తారా? | airport row: high court shock to TDP MP diwakar reddy | Sakshi
Sakshi News home page

మీ బస్సులో అనుమతిస్తారా?

Jul 18 2017 2:19 AM | Updated on Aug 31 2018 8:34 PM

మీ బస్సులో అనుమతిస్తారా? - Sakshi

మీ బస్సులో అనుమతిస్తారా?

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయింది.

జేసీ పిటిషన్‌పై  హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని కోరుతూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. నిషేధంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించింది.  జేసీపై నిషేధం విధించిన ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్‌ ఏసియా, స్పైస్‌ జెట్, టర్బో మెగా ఎయిర్‌ వేస్‌ తదితర విమాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది.  పౌర విమానాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌లకు కూడా నోటీసులు ఇచ్చింది.  

తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, పిటిషనర్‌ తరుఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘పిటిషనర్‌ బస్సు ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని తమ బస్సులోకి అనుమతినివ్వరు కదా. మరి విమానయాన సంస్థలు కూడా నిబంధనలనే పాటించాలి కదా. పాటించకపోతే ప్రయాణికుల భద్రత, రక్షణ ఎలా సాధ్యమవుతాయి?’అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement