బీసీ స్టడీ సర్కిల్‌లో రూ. 5 కోట్ల కుంభకోణం: ఆర్.కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

బీసీ స్టడీ సర్కిల్‌లో రూ. 5 కోట్ల కుంభకోణం: ఆర్.కృష్ణయ్య

Published Thu, Nov 14 2013 12:20 AM

బీసీ స్టడీ సర్కిల్‌లో రూ. 5 కోట్ల కుంభకోణం: ఆర్.కృష్ణయ్య - Sakshi

విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య
 సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్ ఉన్నతాధికారులు రూ. ఐదు కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. పుస్తకాలు,  పత్రికల పేరుతో బోగస్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను అధికారులు స్వాహా చేశారని, దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. బహిరంగ టెండర్లు పిలవకుండానే పుస్తకాలు, మ్యాగజైన్లు కొనుగోలు చేశామని బీసీ స్టడీ సర్కిల్ అధికారులు దొంగ బిల్లులు సృష్టించి రూ. ఐదు కోట్ల స్కామ్‌కు  పాల్పడ్డారని, దీని గురించి సీఎస్‌కు వివరించినట్టు చెప్పారు.

Advertisement
Advertisement