మక్కామృతుల్లో 14 మంది భారతీయులు! | 14 Indians killed in Haj stampede, says Sushma Swaraj | Sakshi
Sakshi News home page

మక్కామృతుల్లో 14 మంది భారతీయులు!

Sep 25 2015 9:49 AM | Updated on Sep 3 2017 9:58 AM

మక్కామృతుల్లో 14 మంది భారతీయులు!

మక్కామృతుల్లో 14 మంది భారతీయులు!

హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 14 మంది భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 14 మంది భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మనవాళ్లు 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జెడ్డాలోని కాన్సల్ జనరల్ చెప్పారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న సుష్మా.. ఎప్పటికప్పుడు సౌదీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సౌదీ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే కచ్చితమైన సంఖ్య తెలుస్తుందన్నారు. గురువారం నాటి తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే. మక్కాతో పాటు సౌదీ అరేబియా వెళ్లే యాత్రికుల కోసం ఉద్దేశించిన ఎమర్జెన్సీ నంబర్లను కూడా సుష్మా ప్రకటించారు.

ఎమర్జెన్సీ నంబర్లు ఇవీ..
మక్కాలో ఎమర్జెన్సీ నంబర్లు: 00966125458000, 00966125496000
సౌదీ అరేబియా భక్తుల కోసం టోల్ఫ్రీ నంబర్లు: 8002477786

 

Advertisement
 
Advertisement
Advertisement