నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య

Published Mon, May 11 2015 7:05 PM

youngster commits suicide

నల్గొండ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలోని ఖిల్లా వెనుక భాగంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  భువనగిరిలోని హనుమాన్‌వాడకు చెందిన రంగా కార్తీక్(28) అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం  సాయంత్రం ఖిల్లాకు చేరుకున్న కార్తీక్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని కాపాడేలోపే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement