
నవీపేట(బోధన్): మండలంలోని ఫతేనగర్ గ్రామానికి చెందిన రమేష్గౌడ్(29) అనే యువకుడు మంగళవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ గౌడ్ తన కల్లుబట్టీలో ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. భార్య లాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి మణితేజ్ అనే రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.