బాలింత మృతి: బంధువుల ఆందోళన | Women dies of Medical negligence in Kothagudem | Sakshi
Sakshi News home page

బాలింత మృతి: బంధువుల ఆందోళన

Sep 29 2017 10:38 AM | Updated on Oct 9 2018 7:52 PM

భద్రాద్రి కొత్తగూడెం:
వైద్యం వికటించడం వల్లే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాలోని టేకులపల్లి మండలం తొమ్మిదో మైలు తండాకు చెందిన తేజావత్‌ ప్రమీల(20) పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టగా కొద్దిసేపటికే ప్రమీల కన్నుమూసింది. కాగా.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె మృతిచెందిదని బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement