రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


నల్గొండ: భువనగిరి మండలం రాయగిరి గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రోడ్డుపై ఆటోకోసం వేచి ఉన్న మహిళను కారులో వస్తున్న వ్యక్తి గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


మృతిచెందిన మహిళ నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన మేకల సుజాత(28)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top