పాలేరు పోలింగ్‌లో వీవీ పీఏటీ టెక్నాలజీ | VVPAT technology in paleru by poll | Sakshi
Sakshi News home page

పాలేరు పోలింగ్‌లో వీవీ పీఏటీ టెక్నాలజీ

May 7 2016 2:05 PM | Updated on Sep 3 2017 11:37 PM

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల అధికారులు వీవీ పీఏటీ సాంకేతికను వినియోగిస్తున్నారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల అధికారులు వీవీ పీఏటీ సాంకేతికను వినియోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్న దేశంలోనే తొలి నియోజకవర్గం పాలేరు అని జిల్లా కలెక్టర్ దానకిషోర్ శనివారం మీడియాకు తెలిపారు. 243 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ మెషిన్లకు వీవీ పీఏటీలను అమరుస్తున్నట్టు ఆయన చెప్పారు. దీని ద్వారా ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు మూడో పక్షం తనిఖీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరో వైపు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరఫున ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సంభాని చంద్రశేఖర్, ఆర్ దమోదర్‌రెడ్డి తదితరులు తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ప్రచారం నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement