దాడ మండల పరిధిలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడులలో ఖమ్మం జిల్లా నుండి కోదాడకు తరలిస్తున్న సుమారు 41క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
నల్గొండ:: కోదాడ మండల పరిధిలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడులలో ఖమ్మం జిల్లా నుండి కోదాడకు తరలిస్తున్న సుమారు 41క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కోదాడ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ పద్మనాభరావు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటకు చెందిన ఉపేందర్ అనే వ్యక్తి తన బొలెరో వాహనంలో కోదాడకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు.
ఈ విషయంపై సమాచామందుకున్న విజిలెన్స్ అధికారులు మంగళవారం ఉదయం మండల పరిధిలోని తమ్మర గ్రామం వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ త నిఖీలలో 40క్వింటాళ్ళ 90కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఉపేందర్పై పౌరసరఫరాల చట్టం 6ఎ కింద కేసు నమోదు చేసి బియ్యాన్ని పట్టణ పరిధిలోని సాయిరాం మిల్లుకు, వాహనాన్ని అప్పగించారు.