ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
బాసరలో వసంత పంచమి వేడుకలు
Feb 12 2016 8:41 AM | Updated on Aug 17 2018 2:53 PM
హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బాసర చేరుకున్నారు. వేకువజామున నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలకు భక్తులు బారులు తీరారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరో వైపు భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement