
కేసీఆర్ పోస్టర్లను చింపుతున్న వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావ్! తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావ్ పోస్టర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుకు అతికించిన కేసీఆర్ పోస్లర్లను చించేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకపోవటంతో వీహెచ్ ఆగ్రహానికి గురయ్యారు. నాచారంలో ఆర్టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్ ప్రచార పోస్టర్లను చింపేశారు. ప్రయాణికులందరూ సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు.