ఇద్దర్ని బలిగొన్న లారీ | two killed by Larry at aleru | Sakshi
Sakshi News home page

ఇద్దర్ని బలిగొన్న లారీ

Nov 19 2015 10:35 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఆలేరు మండల కేంద్రానికి సమీపంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఆలేరు మండల కేంద్రానికి సమీపంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  మృతులను హైదరాబాద్ కి  చెందిన ఖదీర్(58), అబ్దుల్ నజీర్(37)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి వరంగల్ కారులో బయలుదేరగా..మార్గమధ్యంలో టైరు పంక్చరైంది. రోడ్డు పక్కన కారుకు మరమ్మతులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెలుతురు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘట నాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement