రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు | Two died in car accident at warangal district | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

May 25 2014 10:51 AM | Updated on Aug 25 2018 6:06 PM

వరంగల్ జిల్లా రఘునాధపల్లి మండలం పూమళ్ల వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి.

వరంగల్ జిల్లా రఘునాధపల్లి మండలం పూమళ్ల వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement