పోచారం... రైతుల పాలిట గ్రహచారం | TTDP MLA Rajendra reddy takes on Pocharam srinivas reddy | Sakshi
Sakshi News home page

పోచారం... రైతుల పాలిట గ్రహచారం

Nov 7 2014 11:06 AM | Updated on Sep 2 2017 4:02 PM

పోచారం... రైతుల పాలిట గ్రహచారం

పోచారం... రైతుల పాలిట గ్రహచారం

పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రి కావడం తెలంగాణ రాష్ట్ర రైతుల పాలిట గ్రహచారమని టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రి కావడం రైతుల పాలిట గ్రహచారమని టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలపై అవహేళనగా మాట్లాడిన పోచారం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద రాజేందర్రెడ్డి మాట్లాడుతూ... సభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగేవరకు సభను అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రాజేందర్రెడ్డి ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement