14,438 నోటిఫికేషన్ల కోసం సర్కారుకు విద్యుత్ సంస్థల ప్రతిపాదన
* 2016-19 మధ్య నాలుగు వరుస ప్రకటనలు
* ఇంజనీరింగ్తోపాటు ఇతర విభాగాల పోస్టులు సైతం భర్తీ
సాక్షి, హైదరాబాద్
వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ సంస్థల నుంచి ఏటా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. వరుసగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 1,427 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు మరో నెల రోజుల్లో ఆ నియామకాలు పూర్తి చేయనున్నాయి. ఆ వెంటనే 605 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్కో, డిస్కంల నుంచి ప్రకటన విడుదల కానుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ పోస్టుల భర్తీ ముగియనుండగా మళ్లీ వరుసగా మూడేళ్లపాటు విద్యుత్ సంస్థల నుంచి ఇంజనీర్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2016-17, 2017-18, 2018-19లో సైతం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంతోపాటు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెరగనున్న జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో సామర్థ్యం మేరకు ఇంజనీరింగ్, ఇతర కేటగిరీల పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న నాలుగేళ్లలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యపై విద్యుత్ సంస్థలు లెక్కలు వేశాయి. ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల విభాగాల్లో మొత్తం 14,438 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ సంస్థల నుంచి ఇటీవల అందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో 4,947 ఇంజనీరింగ్, 1,520 నాన్ టెక్నికల్, 7,971 ఇతర విభాగాల పోస్టులున్నాయి. నాన్ టెక్నికల్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల్లో జూనియర్ లైన్మెన్, ఫైర్మెన్ ఇతరాత్ర పోస్టులను భర్తీ చేయనున్నాయి. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తే ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నుంచి వరుసగా నాలుగేళ్లపాటు ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.
2016-19 మధ్య కాలంలో భర్తీ చేయాల్సిన విద్యుత్ కొలువుల ప్రతిపాదనల వివరాలు
విభాగం ట్రాన్స్కో జెన్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్
ఇంజనీరింగ్ 2,243 1,315 872 517
నాన్ టెక్నికల్ 250 220 613 437
ఇతర పోస్ట్లు 1,202 1,958 2,007 2,804
నాలుగేళ్లలో విద్యుత్ కొలువులు
Published Fri, Dec 25 2015 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement