హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులు, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు శనివారం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనాయకులు గాంధీభవన్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు గాంధీభవన్లో కార్యక్రమాన్ని ప్రారంభించి, అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పిస్తారు. తర్వాత లక్డీకాపూల్ మీదుగా ఖైరతాబాద్కు, అక్కడి నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర ఉంటుంది. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ముఖ్య నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, మహ్మద్ షబ్బీర్ అలీ, తదితర నేతలు పాల్గొంటారు. కాగా.. టీపీసీసీ చలో రాజ్ భవన్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నగర అదనపు కమిషనర్ (శాంతి, భద్రతలు) అంజనీకుమార్ స్పష్టంచేశారు.
9 నుంచి దళిత చైతన్యయాత్ర
దళితులను అణగదొక్కేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ఎస్సీ విభాగం ఆరోపించింది. తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు రక్షణ ఉండదన్న భయాన్ని కలిగిస్తున్నారని, సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ నెల 9-13 తేదీల్లో దళితచైతన్య యాత్ర పేరిట రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించింది. 9న హైదరాబాద్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సాగనుంది. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన భేటీలో ఎస్సీ విభాగం చైర్మన్ ఎ.కృష్ణ, నాయకులు మల్లురవి, అద్దంకి దయాకర్, కె.మానవతారాయ్, గజ్జెలకాంతం తదితరులు పాల్గొన్నారు.
నేడు టీపీసీసీ చలో రాజ్భవన్
Published Sat, Feb 7 2015 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రశాంతంగా ‘నీట్’
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement