టూరిస్టులే దేవతలు: పేర్వారం | The tourists are gods to us | Sakshi
Sakshi News home page

టూరిస్టులే దేవతలు: పేర్వారం

Aug 29 2016 7:15 PM | Updated on Sep 4 2018 5:21 PM

టూరిస్టులే దేవతలు: పేర్వారం - Sakshi

టూరిస్టులే దేవతలు: పేర్వారం

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి టూరిస్టులే దేవతలని టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి టూరిస్టులే దేవతలని మాజీ డీజీపీ, టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. సోమవారం ఎల్‌బీ స్టేడియంలో టీఎస్‌టీడీసీ రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ పేరుతో వివిధ రకాల ఆటపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టంబర్ 26న సరిగ్గా రెండేళ్ల క్రితం టీఎస్‌టీడీసీ ఆవిర్భించిందన్నారు. కేవలం 60 లక్షలు మాత్రమే టూరిస్టుల సందర్శన ఉండగా, టీఎస్‌టీడీసీ కొత్త కొత్త టూరిస్టు ప్రాంతాలను అభివృద్ధి చేయగా ఈ ఏడాది కోటీ పదహారు లక్షల మంది టూరిస్టు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సందర్శించారన్నారు. చైనాతో సంబంధ బంధవ్యాలను పెంచుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన క్యాథపెస్‌విక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది 1200 మంది చైనా వాసులు తెలంగాణలోని బౌద్ద క్షేత్రాలను సందర్శించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement