అభ్యర్థి నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..

Tanish React On Telangana Elections Voting - Sakshi

బంజారాహిల్స్‌: ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్‌ రోజు వినియోగిస్తేనే దానికి సార్థకత. ఐదేళ్ల పాటు మన మంచీచెడులను చూసే నేతలను ఎన్నుకునే ఈ క్రతువులో ఓటు అనే ఆయుధమే ప్రజా అస్త్రం. ఈ వజ్రాయుధాన్ని వినియోగించుకోకుంటే మనం విజయవంతమైనట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మెరుగైన సమాజం కోసం ఓటు వేసి బాధ్యతను నెరవేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా అనే మరో ఆప్షన్‌ ఉందనే విషయం మర్చిపోకూడదు. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగింకుంటాను. మీరు కూడా తప్పనిసరిగా ఓటు వేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఓటు మాత్రమే.           – తనీష్, సినీ నటుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top