కలెక్టరేట్ : ప్రభుత్వ శాఖలలో అమలవుతున్న పథకాలపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న సమీక్షించారు. మంగళవారం అటవీశాఖ కార్యాలయంలోని అతిథి గృహం లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఆత్మ, వెటర్నరీ, ఉద్యానవన, గ్రామీణ నీటి సరఫరాపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ముందుగారా మన్నను ఆయా శాఖల ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, గతేడాదిలో శాఖలవారీగా లక్ష్యం, సాధించిన ప్రగతి నివేదిక లు తనకు సమర్పించాలని సూచించారు.
పెండింగ్ బడ్జెట్ పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖల మీద అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్నూర్ మం డలంలోని వెటర్నరీ భవనానికి సంబంధించి నిధులు రాలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెట ర్నరీ శాఖలో ఉద్యోగుల ఖాళీలు తదితర వివరాలు తన కు పంపించాలన్నారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, డెయిరీఫాంలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్షెడ్లు జిల్లాలో ఎన్ని ఉన్నాయని అడగగా, జిల్లాలో 30 చోట్ల వాటర్షెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులకు శిక్షణ అందించడంలో ఆత్మ వెనుకబాటుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకు సంబంధించిన వివరాలు తనకు పంపాలన్నారు. హార్టికల్చర్ పంటలకు సంబంధించి మామిడి, పసుపు, మిర్చి, అరటి, కూరగాయల పంటలను పండిం చే విధానం, జిల్లాలో ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలుసుకున్నారు.
21,673 హెక్టార్లలో మామిడి, 2,600 హెక్టార్లలో పసుపు పండిస్తున్నారని ఏడీ రమణ పవర్పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది 27 కంపెనీలకు చెందిన 20.63 లక్షల ప్యాకెట్ల విత్తనాలు మన జిల్లాకు వచ్చాయని జేడీఏ రోజ్లీల తెలిపారు. నష్టపరిహారం వచ్చిందా? ఇంకేంత రా వాల్సి ఉంది? అనే విషయాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. విత్తనాల ఉత్పత్తిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిపారు.
అయితే జిల్లాలో గోదాముల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న జననీ సురక్ష యోజన తదితర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎడీఎహెచ్ రామరావు, కుమారస్వామి, నర్సింగ్రావు, హార్టికల్చర్ ఏడీ రమణ, ఆత్మ పీడీ మనోహర్, జేడీ ఏ రోజ్లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శాఖలపైమంత్రి సమీక్ష
Published Wed, Jun 18 2014 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement