రెండు బైక్‌లు ఢీ..జవాను మృతి | soldier dies in bike accident in palamuru district | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ..జవాను మృతి

Nov 4 2015 3:57 PM | Updated on Apr 3 2019 8:07 PM

పాలమూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్ జిల్లా: పాలమూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అచ్చంపేట మండలం శేఖరయ్య తోట వద్ద బుధవారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బల్మూరు మండలం తోడేళ్లగట్ట గ్రామానికి చెందిన కొనమోని ఈశ్వర్(26) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈశ్వర్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఈశ్వర్ తిరిగి రేపు జార్ఖండ్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో రామస్వామి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ఫకీర్(60) అనే వ్యక్తికి కాలు విరిగడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement