ఒకే కొమ్మకు.. రెండు రంగుల పూలు..

Single stalk .. two flowers - Sakshi

పాల్వంచరూరల్‌ : ఒకే చెట్టుకు రెండు రకాల మందారపూలు పూస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీ లక్ష్మిదేవిపల్లిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన ఇంట్లో నాలుగేళ్లుగా పసుపు రకం మందార చెట్టును పెంచుతున్నాడు.

ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు పసుపు రంగు పూలు మాత్రమే పూసేవి. కానీ.. ఇటీవల అదే చెట్టుకు ఎర్ర మందారాలు కూడా పూస్తున్నాయి. ఒకే కొమ్మకు పక్కపక్కనే రెండు రంగుల పూలు పూయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top