నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు | seven vidyut poles vandalised | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

Feb 27 2015 4:57 PM | Updated on Sep 2 2017 10:01 PM

టిప్పర్ ఢీకొనడంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

మహబూబ్‌నగర్ (అమర్‌చింత): టిప్పర్ ఢీకొనడంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమర్‌చింత మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు-అమర్‌చింత రహదారి విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో కంకర సరఫరా చేయడానికి వచ్చిన టిప్పర్ వాహనం శుక్రవారం మధ్యాహ్నం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వరుసగా ఏడు స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా లేని సమయం అవటంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement