నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 5 కే అన్నపూర్ణ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి ప్రారంభించారు.
ఎంజీఎంలో రూ. 5కే భోజన పథకం
Jun 2 2017 2:11 PM | Updated on Sep 5 2017 12:40 PM
వరంగల్ అర్బన్: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 5 కే అన్నపూర్ణ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి ప్రారంభించారు. ఆస్పత్రిలో చికిత్సి కోసం వచ్చే వారి అటెండెంట్లకు ఈ పథకం లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అరూరి రమేష్, ఎమ్మెల్సీ మురళీధర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు, కలెక్టర్ అమ్రాపాలి కమీషనర్ శృతిఓజా, ఎంజీఎం సూపరెండెంట్ రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement