నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో ప్రధానంగా చిల్లర వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. వ్యాపార లావాదేవీల్లో చిల్లర ఎంతో అవసరంగా మారడం తో వ్యాపారస్తులు చిల్లరను కొనుగోలు చేస్తున్నారు. చిల్లర వ్యాపారంలో కిరాణషాపు యజమానులు, భిక్షాటన చేసేవారు ప్రధానంగా ఉన్నారు. కిరాణ షాపు యజమానులు బ్యాంకుల నుంచి చిల్లరను తీసుకొని ఇతర వ్యాపారస్తులకు విక్రయాలు చేస్తున్నారు. రూ. 100 చిల్లరకు రూ. 15 నుంచి రూ. 20 కమీషన్ తీసుకుంటున్నారు.
డిమాండ్ను బట్టి ఈ కమీషన్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. మొత్తానికి 15 రూపాయలకుపైబడే కమీషన్ ఉంటుంది. ఇలా చి ల్లరను రూ. 100 చొప్పున మూటకట్టి వ్యాపార సముదాయాలు, హోటళ్లు, టీపాయింట్లు, షో రూంలు, వైన్స్ లు, బెకరీలు, ఇ తర వ్యాపారస్తులకు కమీష న్ పద్ధతి మీద మార్పిడి చేస్తున్నా రు. కేవలం ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నవారు సుమారు 100 మంది వరకు ఉంటా రు.
అదే విధంగా పట్టణంలో భిక్షాటన చేసేవారు ఈ చిల్లర దందాను నడిపిస్తారు. వంద రూపాయలకుగాను రూ. 8 కమీషన్ తీసుకొని దుకాణాదారులకు చిల్లర ను అందిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఈ దందా కొనసాగుతుంది. ఉదయమంతా భిక్షాటన చేసి రాత్రి ఏడు గంటలకు ముందుగానే మాట్లాడుకున్న హోటల్, వ్యాపార సముదాయానికి వెళుతారు. ఆ రోజు వారికి భిక్షాటనలో లభించిన చిల్లరను వ్యాపారులకు ఇచ్చి కమీషన్ తీసుకుంటారు. ఇలా పలువురు వ్యాపారస్తులు కూడా అవసరార్థం భిక్షాటన చేసేవారిని చిల్లర కోసం సంప్రదిస్తారు.
ఈ చిల్లర దందా నెలకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 5,380 వ్యాపార సముదాయాలు రిజిష్టర్ అయి ఉన్నాయి. ఈ చిల్లర మార్పిడి జరుగుతున్న దుకాణాలు 4 వేల వరకు ఉన్నాయి. ప్రతి రోజు 15 రూపాయల లేదా 20 రూపాయల వరకు కమీషన్ తీసుకొని చిల్లర మార్పిడి చేస్తుండడంతో రోజుకు రూ. 60 వేలకు పైగా కమీషన్ దందా కొనసాగుతోంది. ఇలా నెలకు సుమారు రూ. 2 కోట్ల కమీషన్దందానే నడుస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
భలే గిరాకీ..
భిక్షాటన చేసేవారు వ్యాపారస్తులకు అవసరం తీర్చేవారుగా మారారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, దేవాలయాలు, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భిక్షాటన చేసేవారు రోజులో ఒక్కొక్కరు సుమారు రూ. 200 నుంచి రూ. 300 వరకు సంపాదిస్తారు. వీరు సాయంత్రం ఒప్పందం చేసుకున్న వ్యాపారుల వద్దకు వెళ్లి కమీషన్కు చిల్లర నాణేలను అందజేస్తారు.గతంలో వంద రూపాయలకు ఐదు రూపాయల కమీషన్ ఉండేది. వ్యాపారుల డిమాండ్ పెరగడంతో కమీషన్ను ఎనిమిది రూపాయలకు పెంచారు.
బ్యాంకుల, యజమానుల ఒప్పందం..
కొందరు కిరాణషాపు యజమానులు, మరి కొందరు చిల్లర దుకాణాదారులు చిల్లరను విక్రయించే బ్యాంకులతోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్యాంకు వారు కూడా కేవలం వారికే చిల్లరను విక్రయిస్తున్నారు. బ్యాంకు అధికారులు సైతం రూ. 6 చొప్పున కమీషన్ తీసుకొని ఒప్పందం చేసుకున్న వారికే మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బ్యాంకులో ఎలాంటి కమీషన్ లేకుండానే చిల్లరను అందజేయాల్సి ఉంటుంది. రూ. 100 పైబడి చిల్లరను బ్యాంకు అధికారులు అందిస్తున్నారు. ఈ చిల్లరపై ప్రధానంగా ఎవరు దృష్టి పెట్టకపోవడమే కారణం.
జోరుగా చిల్లర దందా....
Published Sun, Aug 10 2014 2:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement